కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోడీ ధ్వజం
గత హామీల అమలుపై నిలదీయండి
ఫైళ్ల క్లియరెన్స్కు ‘జయంతి’ ట్యాక్స్ కట్టాలి
నితీశ్, యూపీఏ వల్లే బీహార్ వెనుకబాటు
గుమ్లా (జార్ఖండ్)/ ససారాం (బీహార్): కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక అబద్ధాల మూట అని పేర్కొన్నారు. 2004, 09 మేనిఫెస్టోల్లో పెట్టి అమలు చేయని హామీలనే మళ్లీ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారన్నారు. గురువారం గుమ్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయనీ విమర్శలు చేశారు. రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోలు గీత, బైబిల్, ఖురాన్లాంటివని, వాటితో ప్రజలను ఏమార్చకూడదని మోడీ అన్నారు.
దరల పెరుగుదలను అరికడతామని, కుటుంబానికో ఉద్యోగమిస్తామని గతంలోఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని చెప్పారు. ఆ మేనిఫెస్టోల్లో ఎన్నింటిని, ఎప్పుడు అమలుపర్చారో, వాటి ఫలితాలేమిటో బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్ను నిలదీయండని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని చెబుతూ.. ఢిల్లీలో సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ట్యాక్స్ లాగే ఫైళ్లకు మోక్షం కలగాలంటే జయంతి ట్యాక్స్ కూడా కట్టాలని మాజీ మంత్రి జయంతి నటరాజన్పై వ్యంగ్య వాగ్బాణాలు సంధించారు. అనంతరం బీహార్లోని సస్రాం సభలో మాట్లాడుతూ.. బీహార్ వెనుకబాటుతనానికి రాష్ర్టంలో నితీశ్, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాలే కారణమన్నారు.
గన్నులు కాదు, పెన్నులు పట్టుకోవాలి..
హింసను విడనాడాలని మోడీ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. యువకుల చేతుల్లో పెన్నులో లేదా నాగళ్లో ఉండాలని తాను కలలు కన్నానని, ఆ చేతుల్లో గన్నులు ఉండకూడదని అన్నారు. మహాత్మాగాంధీ అహింసాసిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుని యువత తుపాకులను విడనాడాలని కోరారు. కాగా, వడోదరాలో మోడీపై పోటీకి తపస్ దాస్ గుప్తాను సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఫర్ ఇండియా-కమ్యూనిస్ట్ (సుసీ-సి) బరిలోకి దింపుతోంది.
అది దురదృష్టం: పాకిస్థాన్
భారత్లో తమ దేశం ఒక ఎన్నికల అంశం అయిపోయిందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నిం ఆస్లాం ఆవేదన వ్యక్తం చేశారు. అది దురదృష్టకరమన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై మోడీ వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
మోడీ సభలో చెప్పులు, రాళ్లు
నరేంద్ర మోడీ గురువారం గయలో నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. గయలోని గాంధీ మైదానంలో నిర్వహించిన సభకు మోడీ రాక ఆలస్యం కావడంతో అప్పటికే వేచిఉన్న జనం విసిగిపోయారు. మోడీ వేదికపైకి వస్తుండగా తోపులాట మొదలై.. చెక్క బారికేడ్లు విరిగిపోయాయి. కొంత మంది మీడియాకు కేటాయించిన ప్రాంతంలోకి కూడా చొచ్చుకొచ్చారు. పోలీసులు వారిని అదుపు చేయడానికి లాఠీచార్జి చేయబోగా.. కొందరు వారిపై చెప్పులు, రాళ్లు విసిరారు. ఎట్టకేలకు బీజేపీ నాయకులు పదే పదే విజ్ఞప్తి చేసి ప్రజలను శాంతింపజేయడంతో పరిస్థితి దారికొచ్చింది.
గయలో చెలరేగిన మావోలు
గయ(బీహార్): నరేంద్ర మోడీ గురువారం ఎన్నికల ర్యాలీ నిర్వహించ తలపెట్టిన బీహార్లోని గయ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శక్తిమంతమైన బాంబులు పెట్టి రెండు మొబైల్ టవర్లను పేల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక దుమారియా బజార్, మంరలి గ్రామాల్లోకి ప్రవేశించిన వంద మంది మావోయిస్టులు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన రెండు మొబైల్ టవర్లను పేల్చివేశారని, ఇందుకు శక్తిమంతమైన బాంబులు వాడారని దర్యాప్తులో తేలినట్లు ఎస్పీ నిషాంత్ తివారీ తెలిపారు. ఇటీవల ఛాత్రా జిల్లాలో పది మంది మావోయిస్టులను కాల్చి చంపడానికి నిరసనగా నక్సల్స్ పలు జిల్లాల్లో బంద్కు పిలుపునిచ్చారు. మోడీ ఈ జిల్లాలో గురువారం సభ నిర్వహిస్తుండగా నక్సల్స్ బాంబులు పేల్చడం చర్చనీయాంశమైంది.
బీజేపీ ఆందోళన: నక్సల్ పేలుళ్ల నేపథ్యంలో తమ పార్టీ సభల భద్రతకు ముప్పు పొంచి ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తంచేసింది. ‘‘బీజేపీ సభలే లక్ష్యంగా నక్సల్స్ దాడులు చేయడానికి చూస్తున్నారని చాలాసార్లు మేం ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. ఇటీవల ఉగ్రవాదులు అరెస్టవడం, ఇప్పుడు గయా జిల్లాలో నక్సల్స్ బాంబు పేలుళ్లకు పాల్పడడంతో మా అనుమానాలు నిజమని స్పష్టమవుతోంది’’ అని బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ అన్నారు.
అదంతా అబద్ధాల మూట..
Published Fri, Mar 28 2014 3:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement