యూపీలో బీజేపీ నేత కాల్చివేత | BJP Leader Shot Dead By Unknown Assailants | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీ నేత కాల్చివేత

Jul 21 2019 10:19 AM | Updated on Jul 21 2019 2:40 PM

BJP Leader Shot Dead By Unknown Assailants - Sakshi

యూపీలో బీజేపీ నేత దారుణ హత్య

లక్నో : యూపీ బీజేపీ నేత డాక్టర్‌ బీఎస్‌ తోమర్‌ను ఘజియాబాద్‌ జిల్లా మసూరి ప్రాంతంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. బొలెరో వాహనంపై వచ్చిన సాయుధ దుండగులు బీజేపీ నేతపై కాల్పులు జరిపారని స్ధానికులు తెలిపారు. తోమర్‌ కార్యాలయంలో ఉండగా దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. దుండగులు ఆయనపై ఐదు రౌండ్లు కాల్పులు జరపగా స్ధానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బీజేపీ నేత మరణించారు.

పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే దాడి జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు నేరానికి పాల్పడిన అనంతరం వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యాయని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement