భారీ ఎన్‌కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి

8 Maoists died in Gadchiroli encounter - Sakshi

గడ్చిరోలి : మహారాష్ట్ర గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరా హోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోల కదలికల గురించి సమాచారం అందుకున్న బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో  వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా  బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు దళానికి  గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top