వైద్యుడికి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి.. | 40-year-old doctor shot dead at Uttarakhand govt hospital | Sakshi
Sakshi News home page

వైద్యుడికి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి..

Apr 20 2016 7:39 PM | Updated on Sep 3 2017 10:21 PM

వైద్యుడికి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి..

వైద్యుడికి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి..

ఉత్తరాఖండ్లో ఓ ప్రభుత్వ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని సాయుధులు అతడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి కాల్చి చంపారు.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఓ ప్రభుత్వ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని సాయుధులు అతడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి కాల్చి చంపారు. అతడు విధుల్లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

బిహార్ లోని గయ జిల్లాకు చెందిన సునిల్ కుమార్ సింగ్ అనే శిశు వైద్యుడు ఉత్తరాఖండ్ లోని జోష్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉదయం ఆస్పత్రి విధుల్లో ఆయన బిజీబిజీగా ఉండగా అనూహ్యంగా దుండగులు అందరూ చూస్తుండగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో సదరు వైద్యుడు ప్రాణాలు విడిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement