నా కళ్లు తెరిపించింది

Taapsee Pannu Says She's Been Dropped From Pati Patni Aur Woh remake - Sakshi

2018 బాలీవుడ్‌ బాగా కలిసొచ్చింది తాప్సీకి. మూడు హిట్స్‌ అందుకోవడమే కాకుండా నటిగా అద్భుతమైన మార్కులు సంపాదించారామె. లేటెస్ట్‌గా యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌తో కలసి ‘పతీ పత్నీ అవుర్‌ వో’ అనే చిత్రం రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావాలి. అయితే చివరి నిమిషంలో ఈ సినిమాలో హీరోయిన్‌ తాప్సీ కాదని చిత్రబృందం అనౌన్స్‌ చేయడంతో ఆమె షాక్‌ అయ్యారు. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం నా షెడ్యూల్‌ అంతా సెట్‌ చేసుకొని వాళ్లకు డేట్స్‌ ఇచ్చాను.

నేను హీరోయిన్‌ కాదని తెలియడంతో షాక్‌ అయ్యాను. దర్శక–నిర్మాతలను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ విషయంపై ఎంత క్లారిటీ తెచ్చుకుందామనుకున్నా జవాబు చెప్పకుండా మాట దాటేస్తున్నారు. ఈ విషయం కొంచెం ముందే తెలిసినా ఈ సినిమా కోసం సర్దుబాటు చేసిన డేట్స్‌ వేరే సినిమాలకైనా ఇచ్చేదాన్ని. ఈ సంఘటన వల్ల ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థం అయింది. ఒక విధంగా చెప్పాలంటే జరిగిన సంఘటన నా కళ్లు తెరిపించింది’’ అని తాప్సీ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top