భూసమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య | Farmer commited suicide about his land issue | Sakshi
Sakshi News home page

భూసమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య

Jan 30 2018 2:06 AM | Updated on Nov 6 2018 7:53 PM

Farmer commited suicide about his land issue - Sakshi

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): తన భూ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు హెచ్చరించాడు. సోమవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కిరోసిన్‌ డబ్బాతో వచ్చాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌కు చెందిన ఈశ్వరయ్య తనకు ఉన్న ఏడు గుంటల భూమిని పక్క పొలానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఆక్రమించుకున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు.

ఈ సందర్భంగా ఆయన కిరోసిన్‌ డబ్బాతో వచ్చి.. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సిబ్బంది గుర్తించి కిరోసిన్‌ డబ్బా లాక్కొని సర్ది చెప్పారు. అనంతరం అతను కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌కు వినతిపత్రం సమర్పించగా.. ఆయన మిడ్జిల్‌ తహసీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఈశ్వరయ్యకు న్యాయం చేయాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement