పేద ప్రజలకు 2 వేల కూరగాయల కిట‍్ల పంపిణీ

YSRCP Leaders Distributes Vegetables Kits To Poor People - Sakshi

సాక్షి, బేతంచర్ల : వైఎస్సార్‌ సీపీ నాయకులు చలం రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలు, కార్మికులకు ఆదివారం కూరగాయల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు రెండు వేల కూరగాయల కిట్లను వారికి అందజేశారు. సీఐ కేశవ రెడ్డి తన చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ముర్తుజావలి, మండల కన్వీనర్ లక్ష్మి రెడ్డి, నాయకులు బాబుల్ రెడ్డి, కాజా, బుగ్గన ప్రభాకర్ రెడ్డి, రామచంద్రుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top