తెలుగు సినిమాలను బెంగళూరు ఆదరిస్తుంది | Mahesh babu comments at banglore on telugu cinema | Sakshi
Sakshi News home page

Sep 25 2017 2:24 AM | Updated on Sep 25 2017 2:42 AM

Mahesh babu comments at banglore on telugu cinema

శివాజీనగర (బెంగళూరు): తెలుగు సినిమాలను ఉభయ రాష్ట్రాల తర్వాత బెంగళూరు ప్రజలే ఎక్కువగా ఆదరిస్తారని సినీ హీరో మహేశ్‌బాబు అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘స్పైడర్‌’ సినిమా ప్రచారం కోసం ఆదివారం ఆయన బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా మహేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన ఒక్కడు, అతడు, పోకిరి, శ్రీమంతుడు సినిమాలను బెంగళూరు ప్రేక్షకులు బాగా ఆదరించారని, స్పైడర్‌ను కూడా ఆదరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్, హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్, నిర్మాత ఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement