జంట పేలుళ్లు: 12మంది మృతి


పాకిస్థాన్ : పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని కైబర్ పక్తున్వ ప్రావెన్స్లో శుక్రవారం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కోర్డు ఆవరణలో జరిగిన ఈ దాడిలో లాయర్లు, పోలీసులు ఎక్కువ సంఖ్యలో మరణించారు. కొద్ది రోజుల క్రితం లాయర్లను టార్గెట్ చేసుకుని పాక్ లోని ఓ ఆసుపత్రిలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే.


ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఎవరు ప్రకటించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top