బ్రిస్బేన్ నుంచి సిడ్నీ చేరుకున్న మోదీ | Narendra modi reaches Sydney | Sakshi
Sakshi News home page

బ్రిస్బేన్ నుంచి సిడ్నీ చేరుకున్న మోదీ

Nov 17 2014 9:09 AM | Updated on Aug 15 2018 2:20 PM

భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిస్బేన్ నుంచి సిడ్నీ చేరుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన సిడ్నీతో పాటు కాన్‌బెర్రా,

సిడ్నీ : భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిస్బేన్ నుంచి సిడ్నీ చేరుకున్నారు.  ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన సిడ్నీతో పాటు  కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌లలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియాలోకెల్లా అతిపెద్ద ఇండోర్ స్టేడియం అయిన 'ఆల్ఫోన్స్ అరెనా' లో (సిడ్నీ సూపర్ డోమ్ అని కూడా పిలుస్తారు) ప్రవాస భారతీయులను ఉద్దేశించి  ప్రసంగించనున్నారు.

ఇటీవలి అమెరికా పర్యటనలో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'మేడిసన్ స్క్వేర్'లో 20 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఆ తరహాలోనే ప్రవాస భారతీయులను తన ప్రసంగంతో ఉర్రూతలూగించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 16 వేల మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని అంచనా. అలాగే స్టేడియం వెలుపల మరో 5 వేల మంది భారీ తెరల్లో మోదీ ప్రసంగాన్ని వీక్షిస్తారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement