గత కొన్ని రోజులుగా జపాన్ వాసులను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.
టోక్యో: గత కొన్ని రోజులుగా జపాన్ వాసులను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పశ్చిమ జపాన్ ప్రాంతాలలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైందని స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల సంభవించిన భూకంపాల వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిదని వారు వాపోతున్నారు.
జపాన్ తూర్పు ప్రాంతాల్లో శుక్రవారం కూడా దాదాపు 6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చిబా అనే టైఫూన్ కారణంగా కొన్ని రోజుల నుంచి అక్కడ తరచుగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. అయితే తాము మాత్రం అప్రమత్తంగా ఉన్నామని, అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.