చేజ్ చేస్తున్న పోలీసులపై రాళ్లు రువ్వారు | thieves throw rock through police in Secunderabad bollaram | Sakshi
Sakshi News home page

చేజ్ చేస్తున్న పోలీసులపై రాళ్లు రువ్వారు

Jun 25 2014 10:03 AM | Updated on Mar 19 2019 5:56 PM

సికింద్రాబాద్‌ బొల్లారంలో దొంగలు రెచ్చిపోయారు. ఓం సాయి కాలనీలోని జీవీ రెడ్డి అనే మాజీ సైనిక అధికారి ఇంట్లో దొంగతనానికి దుండగులు బుధవారం యత్నించారు.

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బొల్లారంలో దొంగలు రెచ్చిపోయారు. ఓం సాయి కాలనీలోని జీవీ రెడ్డి అనే మాజీ సైనిక అధికారి ఇంట్లో దొంగతనానికి దుండగులు బుధవారం యత్నించారు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న బొల్లారం పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా పారిపోయారు. పోలీసులు వెంబడించగా వారిపై దొంగలు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులపై దాడిచేసి పారిపోయిన దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement