Sakshi News home page

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం.. ప్రయాణికుల ఆందోళన

Published Mon, Oct 5 2015 8:30 AM

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం.. ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్ : ఓ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం వల్ల 45 మంది ప్రయాణికులు రాత్రి నుంచి ఉదయం వరకు ఇబ్బందులకు గురయ్యారు.  వివరాలు.. ఆదిత్య ట్రావెల్స్లో బెంగళూరు వెళ్లేందుకు 45 మంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, అర్ధరాత్రి నుంచి మెహిదిపట్నంలోని ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 52 వద్ద ప్రయాణికులు ట్రావెల్స్ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. రాత్రి నుంచి రోడ్డుపైనే ఉండాల్సి రావడంతో అసహనానికి గురైన ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement
Advertisement