విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది.
హైదరాబాద్ : విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. శనివారం రోహిత్ బర్త్డే. ఈ సందర్భంగా విద్యార్థులు దీక్ష చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థుల దీక్షకు సంఘీభావంగా తెలపనున్నారు.
అందులోభాగాంగా ఆయన కూడా దీక్ష చేయనున్నారు. అయితే హెచ్సీయూ ఇంఛార్జ్ వీసీ విపిన్ శ్రీవాస్తవ నాలుగు రోజులు సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో డీన్ పెరియాస్వామి ఇంఛార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టారు.