breaking news
Vipin Srivastava
-
శ్రీవాత్సవ వీసీగా వద్దు... అప్పారావును తొలగించాలి
హైదరాబాద్: హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) వైఎస్ చాన్సలర్(వీసీ) పొదిలె అప్పారావును తొలగించాలనీ, సెలవుపై వెళ్లిన ఇన్చార్జి వీసీ బిపిన్ శ్రీవాత్సవను వీసీగా తిరిగి నియమించొద్దని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు విద్యార్థి జేఏసీ ఆదివారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు లేఖ రాసింది. యూనివర్సిటీ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వేముల రోహిత్ కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్ లో ఉన్న రోహిత్ స్కాలర్షిప్ సొమ్మును తక్షణమే విడుదల చేసి అతని కుటుంబానికి అందించాల్సిందిగా తెలిపింది. అంతేకాక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ రోహిత్ మెమోరియల్ లెక్చర్ను ఏర్పాటు చేయాలని తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐదుగురు దళిత విద్యార్థులపై కుల వివక్షతో ప్రవర్తించడమే కాకుండా వారిని హెచ్సీయూ నుంచి సస్పెండ్ చేయడం, సస్పెన్షన్ కారణంగా మనస్తాపం చెందిన వారిలో ఒకరైన వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైనందుకుగానూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్యాంపస్లో వివక్ష, కులబేధం వంటి విషయాలకు తావు లేకుండా అందరితో కలిసిపోయేలా వాతావరణం ఉండేలా నిజనిర్ధారణ కమిటీ సిఫార్సులతో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదవుల కోసం యూనివర్సిటీలకు వచ్చే అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు రక్షణ కల్పించేలా 'రోహిత్ యాక్ట్' ను తీసుకవచ్చి.. దాన్ని తప్పుకుండా అమలు చేసేలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రక్టోరియల్ బోర్డు తొలగించిన అలోక్ పాండే సహా విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ అధ్యాపక సభ్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, అధికారులు సమర్పించిన వారి రాజీనామాలను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంగీకరించవద్దని కోరింది. అలాగే సాధ్యమైనంత తొందరగా వారు తమ బాధ్యతలను స్వీకరించాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను అప్పీల్ చేయాల్సిందిగా విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. -
సెలవుపై వెళ్లిన హెచ్సీయూ ఇంఛార్జ్ వీసీ
హైదరాబాద్ : విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. శనివారం రోహిత్ బర్త్డే. ఈ సందర్భంగా విద్యార్థులు దీక్ష చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థుల దీక్షకు సంఘీభావంగా తెలపనున్నారు. అందులోభాగాంగా ఆయన కూడా దీక్ష చేయనున్నారు. అయితే హెచ్సీయూ ఇంఛార్జ్ వీసీ విపిన్ శ్రీవాస్తవ నాలుగు రోజులు సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో డీన్ పెరియాస్వామి ఇంఛార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టారు. -
'వర్సిటీలో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ప్రయత్నం'
హైదరాబాద్ : హెచ్సీయూలో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీ శ్రీవాస్తవ్ వెల్లడించారు. మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. విద్యార్థులతో చర్చల ద్వారానే ప్రస్తుతం సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు శ్రీవాస్తవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.