బాలికను కిడ్నాప్ చేసి... చెవి పోగులు, కాళ్ల పట్టాలు తీసుకొని వదిలేసిన ఘటన కాప్రా జమ్మిగడ్డలో కలకలం సృష్టించింది. జవహర్ నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం...
వెంటనే పోలీసులు సమీప ఠాణాలకు సమాచారం ఇచ్చారు. రాత్రి 7.20కి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కుషాయిగూడ పోలీసులకు సాకెత్ వద్ద చిన్నారి ధృతి ఏడుస్తూ కనిపించగా వారు జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా బాలికను అపహరించిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.