గులాబి@400, చామంతి@500 | demand pushes flower prices up | Sakshi
Sakshi News home page

గులాబి@400, చామంతి@500

Aug 27 2015 4:58 PM | Updated on Sep 3 2017 8:14 AM

గులాబి@400, చామంతి@500

గులాబి@400, చామంతి@500

రేపు శ్రావణ శుక్రవారం కావడంతో పూలు, పూజ సామాగ్రి కొనుగోళ్లలో మహిళలు మునిగిపోయారు.

హైదరాబాద్ : రేపు శ్రావణ శుక్రవారం కావడంతో పూలు, పూజ సామాగ్రి కొనుగోళ్లలో మహిళలు మునిగిపోయారు. దీంతో పూల మార్కెట్‌ల వద్ద రద్దీ ఎక్కువైంది. ఇదే అదనుగా భావించిన పూల విక్రయదారులు పూల రేట్లను అమాంతం పెంచేశారు. గురువారం సాయంత్రం దిల్సుఖ్నగర్ కొత్తపేటలోని పూల మార్కెట్‌లో బంతిపూలు కిలో రూ.100కు , గులాబి కిలో రూ.400లు, చామంతి పూలు కిలో రూ.500లు పలుకుతుండటంతో మహిళలు అవాక్కవుతున్నారు. నిన్న మొన్నటి వరకు 50-60 రూపాయలు ఉన్న బంతిపూలు రూ.100కు కూడా లభించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement