- రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే సదుపాయాలు కల్పిస్తాం
- గిజో-ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఐదు రోజుల చైనా పర్యటన ముగిసింది. గురువారం రాత్రి 11.20 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబుకు కేంద్రమంత్రులు అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు స్వాగతం పలికారు. చంద్రబాబు శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో సమావేశమవనున్నారు.
కేంద్రమంత్రి ఉమాభారతిని కూడా సీఎం కలవనున్నారు. కాగా చైనా పర్యటన చివరిరోజైన గురువారం సీఎం చంద్రబాబు.. గిజో-ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో ప్రసంగించారు. ఏపీ పర్యాటక రంగంలో ప్రస్తుతం 5.2 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీలో పరిశ్రమలు స్థాపిస్తే సదుపాయాలు కల్పిస్తామన్నారు. చైనా పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలు ఏపీలో పర్యటించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశమున్న రంగాలు, రాష్ట్ర సానుకూలతలు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
చైనాతో ఆరు ఒప్పందాలు
చైనా పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలతో రాష్ట్రప్రభుత్వం ఆరు ఒప్పందాలు చేసుకుంది. పవ ర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పొరేషన్తో జరిగిన ఒప్పందం ఇందులో ఒకటి. ఏపీలో రానున్న పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, విద్యుదుత్పత్తి, ప్రసారం, పారిశ్రామికాభివృద్ధి రంగాల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతుంది. కాగా రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి సహకారమందించడంపై చైనా స్టేట్ కన్స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కంపెనీ లిమిటెడ్తో ఒప్పందం జరిగింది.
రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి సహకారంపై సౌత్ హ్యూటన్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. మరోవైపు రాష్ర్టంలో నిర్మించనున్న బిల్డింగ్ మెటీరియల్ మాన్యుఫాక్చర్ పార్క్ నిర్మాణంలో ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు గిజో చాంగ్ తైయువాన్ ఎనర్జీ సేవింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ లిమిటెడ్ ముందుకొచ్చింది. భవన నిర్మాణరంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానమందించేలా ఎసెడ్రిల్స్ రాక్ టూల్స్ కంపెనీ లిమిటెడ్తో, రాష్ట్రంలో ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులు పెట్టేలా గిజో మారిటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
నేడు అరుణ్జైట్లీతో సీఎం భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో జరిపే సమావేశంలో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధుల విడుదల అంశాలపై చర్చించనున్నారు. సీఎం సమావేశం సందర్భంగా రెవెన్యూలోటు భర్తీ కింద మరో రూ.500 కోట్లు విడుదల చేయనున్నట్లు జైట్లీ ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి అదనంగా మంత్రి పదవుల కేటాయింపుల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రావచ్చని టీడీపీ వర్గాల సమాచారం. అయితే ఈసారికి కేంద్రమంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి అవకాశం దొరకకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
పర్యాటకంలో భారీ పెట్టుబడులకు వీలు
Published Fri, Jul 1 2016 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement