స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం | School bus missed a mortal danger | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Feb 15 2016 2:27 PM | Updated on Sep 3 2017 5:42 PM

ఖమ్మం జిల్లా జూలూరుపాడులో సోమవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది.

ఖమ్మం జిల్లా జూలూరుపాడులో సోమవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కొంచెం దెబ్బతినగా.. బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. కొత్తగూడెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన బస్సును డ్రైవర్ రాకపోవడంతో క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు మహంకాళి కృష్ణ, వందనపు రామారావు, పెండ్యాల నగేశ్, నరసింహారావు సహా పది మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ బస్సును స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement