ఏపీలో రాజ్యాంగం అపహాస్యమైందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అన్నారు.
‘రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేశారు’
Apr 2 2017 12:57 PM | Updated on Sep 5 2017 7:46 AM
అమరావతి: ఏపీలో రాజ్యాంగం అపహాస్యమైందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అన్నారు. కొత్తగా మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసినా మార్పులపై ఈ విధంగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను సైతం భాగస్వామ్యం చేసి బాబు రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేశారని ఉమ్మారెడ్డి విమర్శించారు. గతంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఎన్టీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఉమ్మరెడ్డి అన్నారు.
Advertisement
Advertisement