మొత్తం ఖైదీలు 79,409, శిక్ష ఖరారైనవారు 3,926 | 79,409 prisoners are there in Telangana prisons | Sakshi
Sakshi News home page

మొత్తం ఖైదీలు 79,409, శిక్ష ఖరారైనవారు 3,926

Jan 12 2016 5:35 PM | Updated on Sep 3 2017 3:33 PM

తెలంగాణ జైళ్లలో ఉన్నవారి సంఖ్య 79,409 కాగా వివిధ నేరాల కింద శిక్ష ఖరారై అనుభవిస్తున్నవారు 3,926 మంది మాత్రమేనని.. మిగతావారంతా అండర్‌ట్రయల్స్ అని జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ జైళ్లలో ఉన్నవారి సంఖ్య 79,409 కాగా వివిధ నేరాల కింద శిక్ష ఖరారై అనుభవిస్తున్నవారు 3,926 మంది మాత్రమేనని.. మిగతావారంతా అండర్‌ట్రయల్స్ అని జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో గత ఏడాది సంభవించిన పరిణామాలను వివరించారు.

రాష్ట్రంలోని జైళ్లలో విచారణ ఖైదీల్లో పురుషులు 49,942 మంది కాగా మహిళలు 25,941 మంది ఉన్నారని ఆయన వివరించారు. 2015లో జైళ్లలో వివిధ కారణాలతో 32 మంది మృత్యువాతపడ్డారని పేర్కొన్నారు. ఖైదీల్లో మానసిక పరివర్తన ద్వారా తిరిగి వారు నేరబాట పట్టకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement