‘ఎన్డీఏ బెలూన్ మరోసారి పేలక తప్పదు'

‘ఎన్డీఏ బెలూన్ మరోసారి పేలక తప్పదు' - Sakshi


ఔరంగాబాద్: ఎన్టీఏ కూటమిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. గత 2004, 2009 ఎన్నికల్లో మాదిరిగానే ఎన్డీఏ గ్యాస్ బెలూన్ మరోసారి పేలిపోతుందని ఆయన పునరుద్ఘాటించారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని, బీజేపీ మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు.


 


2004లో ‘భారత్ వెలుగుతోంది’ అంటూ వారు ఊదరగొట్టినా వారి గ్యాస్ బెలూన్ పగిలిపోయిందని, 2009లోనూ అదే జరిగిందన్నారు. ఇప్పుడు కూడా వారు అదే గ్యాస్ బెలూన్‌ను ప్రదర్శిస్తున్నారని, అది కూడా పేలిపోతుందన్నారు.


 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top