దుర్గమ్మ క్యూలైన్లపై భక్తుల ఆగ్రహం | Wrath of the devotees on the queue lines durgamma | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ క్యూలైన్లపై భక్తుల ఆగ్రహం

Oct 5 2016 3:24 PM | Updated on Sep 4 2017 4:17 PM

దుర్గమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్‌లు ఏర్పాటు చేసిన అధికారులు మధ్యలో అత్యవసర మార్గాలను ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

క్యూ లైన్లలోని భక్తులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి వైద్యం అందించడం కూడా చాలా కష్టంగా మారింది. కొద్దిసేపటి క్రితం భక్తుల తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరై కిందపడ్డ ఓ వృద్ధురాలిని వైద్య నిమిత్తం బయటికి తీసుకురావడం చాలా కష్టమైందని భక్తులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement