వంశధార నిర్వాసితుల ఆందోళన.. ఉద్రిక్తత | Vamsadhara villagers agitation during vamsadhara reserviour stage 2 works | Sakshi
Sakshi News home page

వంశధార నిర్వాసితుల ఆందోళన.. ఉద్రిక్తత

Feb 28 2016 12:32 PM | Updated on Sep 3 2017 6:37 PM

వంశధార నిర్వాసితుల ఆందోళన.. ఉద్రిక్తత

వంశధార నిర్వాసితుల ఆందోళన.. ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం దుగ్గుపురంలో వంశధార నిర్వాసితులు ఆందోళనకు దిగారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం దుగ్గుపురంలో వంశధార నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆదివారం పాడలి, తులగాం, దుగ్గుపురంలో వంశధార స్టేజ్‌ పనులు పునః ప్రారంభమయ్యాయి. పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించొద్దని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వందలాదిగా బయలుదేరిన గ్రామస్తులు పనులను అడ్డుకుని అక్కడి టెంట్లను కూల్చి కుర్చీలను విరగ్గొట్టారు.  నిర్వాసితుల ఆందోళనతో అధికారులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో వంశధార రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement