డీడీని కలిసిన టీఎన్జీవోస్‌ నేతలు | tngo leaders met DD | Sakshi
Sakshi News home page

డీడీని కలిసిన టీఎన్జీవోస్‌ నేతలు

Aug 30 2016 12:52 AM | Updated on Nov 6 2018 8:51 PM

నర్సంపేట ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌ మధును సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో టీఎన్జీవోస్‌ నేతలు సోమవారం దళిత సంక్షేమ శాఖ డీడీ శంకర్‌ను హన్మకొండలోని ఆయన కార్యాలయంలో కలిశారు.

హన్మకొండ అర్బన్‌ : నర్సంపేట ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌ మధును సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో టీఎన్జీవోస్‌ నేతలు సోమవారం దళిత సంక్షేమ శాఖ డీడీ శంకర్‌ను హన్మకొండలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఆరోపణలు వచ్చిన నేపద్యంలో ఉద్యోగిపై ముందుగా సమగ్ర విచారణ చేయాలని అలా కాకుండా సస్పెండ్‌ చేయడంవల్ల వార్డెన్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. అంతేకాకుండా హాస్టళ్లకు సకాలంలో సరుకులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు సస్పెన్షన్ల విషయంలో ఉన్నతాధికారులు ఆలోచించి నిర్ణయిం తీసుకోవాలని కోరారు. డీడీని కలిసిన వారిలో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, వార్డెన్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కృష్ణ, ఏఎస్‌డబ్ల్యూవోలు భవానీప్రసాద్, గట్టుమల్లు తదితరులు ఉన్నారు.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement