రాజమహేంద్రవరం 2 బరంపురం | siva devoties padayatra | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరం 2 బరంపురం

Jul 20 2016 11:48 PM | Updated on Sep 4 2017 5:29 AM

రాజమహేంద్రవరం 2 బరంపురం

రాజమహేంద్రవరం 2 బరంపురం

గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఒడిశా నుంచి వచ్చిన శివభక్తులు గోదావరి జలాలతో పాదయాత్రగా తిరుగుపయనమయ్యారు.

గోదావరి జలాలతో శివభక్తుల పాదయాత్ర
రాజానగరం: గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఒడిశా నుంచి వచ్చిన శివభక్తులు గోదావరి జలాలతో పాదయాత్రగా తిరుగుపయనమయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన 15 మంది శివ భక్తులు  డి. కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో శివమాల దీక్షను బూని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు రైలు మార్గాన మంగళవారం రాజమహేంద్రవరం చేరకున్నారు.

అక్కడ స్నానాలు ఆచరించిన వారు వెంట కలశాలలో గోదావరి జలాలను తీసుకుని పాదయాత్రగా స్వస్థలానికి బయల్దేరారు. జాతీయ రహదారిన నడుస్తూ  బుధవారం దివాన్‌చెరువు వచ్చిన వారిని ‘సాక్షి’ పలుకరించింది. గోదావరి పవిత్ర జలాలతో అక్కడ శివలింగాన్ని అభిషేకిస్తే మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement