27 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

27 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

Published Mon, Aug 22 2016 12:27 PM

robbers hulchul in krishna pushkaralu

విజయవాడ: విజయవాడ నగరంలో 27 మంది అంతర్రాష్ట్ర దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 7 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చిన భక్తుల నుంచి దొంగలు ఈ సొత్తును కాజేశారు. పట్టుబడిన దొంగల్లో ఒడిస్సాకు చెందిన14 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు, యూపీకి చెందిన ఇద్దరు ఉన్నారు. వీరిలో 16 మంది మహిళలు ఉండటం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement