బైక్ను కారు ఢీకొనడంతో ఇద్దరు ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్లు మృతిచెందిన సంఘటన మండలంలోని గుండ్లపహాడ్లో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్ల మృతి
Sep 28 2016 12:15 AM | Updated on Aug 30 2018 4:10 PM
నల్లబెల్లి : బైక్ను కారు ఢీకొనడంతో ఇద్దరు ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్లు మృతిచెందిన సంఘటన మండలంలోని గుండ్లపహాడ్లో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని రుద్రగూడెం శివారు వల్లెనర్సయ్యపల్లికు చెందిన చిట్యాల రవీందర్రెడ్డి(33), నర్సంపేట మండలం బాంజీపేటకు చెందిన కట్ల తిరుపతిరెడ్డి(32) ఎన్పీడీసీఎల్లో కాంట్రాక్టర్లుగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు నర్సంపేట నుంచి వల్లెనర్సయ్యపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. గుండ్లపహాడ్ గ్రామంలో జాతీయ రహదారిపై ములుగు మండలం మల్లంపల్లి నుంచి నర్సంపేట వైపు వస్తున్న గోనెల రవీందర్కు చెందిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టిం ది. బైక్పై వెళ్తున్న రవీందర్రెడ్డి, తిరుపతిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. కాగా తిరుపతిరెడ్డి కాలు తెగింది. గమనించిన స్థానికులు వారిని 108లో ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఇద్ద రు మృతిచెందారు. విషయం తెలుసుకొన్న ఎస్సై ఎం.రాజమౌళి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కారులో ఉన్న మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement