వెల్లువెత్తిన నామినేషన్‌లు | Nominations flooded | Sakshi
Sakshi News home page

వెల్లువెత్తిన నామినేషన్‌లు

Feb 21 2017 12:05 AM | Updated on Jun 1 2018 8:31 PM

శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల దాఖలు గడువు సోమవారం నాటితో ముగిసింది.

– ఉపాధ్యాయ నియోజకవర్గానికి 14 మంది 25 నామినేషన్‌లు
– పట్టభద్రుల నియోజకవర్గానికి 37 మంది 62 నామినేషన్‌లు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల దాఖలు గడువు సోమవారం నాటితో ముగిసింది. ముఖ్యంగా పట్టభద్రుల నియోజక వర్గానికి నామినేషన్‌లు  వెల్లువెత్తాయి. మొత్తంగా 51 మంది అభ్యర్థులు 87 నామినేషన్‌లు ధాఖలు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉపాధ్యాయ నియోజకవర్గానికి 14 మంది అభ్యర్థులు 25 నామినేషన్‌లు ధాఖలు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గానికి 39 మంది అభ్యర్థులు 62 నామినేషన్‌లు అనంతపురం జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. మంగళవారం నామినేషన్‌లను పరిశీలిస్తారు. బుధవారం నామినేషన్‌ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నామినేషన్‌ల ధాఖలు  కార్యక్రమం పూర్తి కావడంతో అభ్యర్థులు ఇక ప్రచారంపై దృష్టి సారించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement