స్వామివారి రథోత్సవంలో అపశ్రుతి | Man injured critically while rathosavam is moving on | Sakshi
Sakshi News home page

స్వామివారి రథోత్సవంలో అపశ్రుతి

May 25 2016 5:28 PM | Updated on Sep 4 2017 12:55 AM

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతున్న సమయంలో విద్యుత్‌ తీగలు అడ్డురావడంతో వాటిని తొలగించేందుకు ఓ వ్యక్తి విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. ఈ నేపథ్యంలో స్తంభం పైనుంచి అతడు ప్రమాదవాశాత్తూ జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

అతన్ని వెంటనే బళ్లారి ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి మరమ్మతులు ప్రైవేట్‌ వ్యక్తితో చేయిస్తున్న ట్రాన్స్‌కో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement