 
															బీడీ కార్మికులందరికీ పింఛన్లు: కవిత
కాంగ్రెస్ పార్టీ హయాంలో పథకాలు పక్కదారిపట్టాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శించారు.
	నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలో పథకాలు పక్కదారిపట్టాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో నిధులు దుర్వినియోగం కావడంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
	
	సోమవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామజ్యోతి సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
