అలిపిరిమార్గంలో భక్తుడి మృతి | Sakshi
Sakshi News home page

అలిపిరిమార్గంలో భక్తుడి మృతి

Published Wed, Jul 27 2016 12:35 PM

devotee died due to heart attack in tirumala

తిరుమల: శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళుతున్న ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. విజయవాడకు చెందిన రఘు(28) అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున కాలినడకన తిరుమల వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement