
ఘనంగా సీఆర్పీఎఫ్ జవాను అంత్యక్రియలు
ధర్మవరం పట్టణానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను జార్ఖండ్లో మృతిచెందిన విషయం తెలిసిందే.
ధర్మవరం అర్బన్ : ధర్మవరం పట్టణానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను జార్ఖండ్లో మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ మధుసూదన్రెడ్డి, చౌడప్ప, లోనికోట అమర్, నరేంద్రరెడ్డిలు జవాను గురుప్రసాద్ భౌతికకాయం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.
అనంతరం జవాను ఇంటి వద్ద నుంచి పుష్ప వాహనంపై పార్థివదేహాన్ని ఉంచి వందలాది మంది జనసందోహం నడుమ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గురుప్రసాద్ తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్నేహితులు గురుప్రసాద్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడని ఉన్నతస్థాయి అధికారులు విచారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కన్నీటి వీడ్కోలు మధ్య జవాను అంత్యక్రియలు ముగిశాయి.