వ్యక్తిని బలిగొన్న సిమెంట్ ట్యాంకర్ | cement tanker crashed moshed, one man killed | Sakshi
Sakshi News home page

వ్యక్తిని బలిగొన్న సిమెంట్ ట్యాంకర్

Feb 23 2014 1:37 AM | Updated on Apr 3 2019 7:53 PM

సిమెంట్ ట్యాంకర్ మోపెడ్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

పరిగి, న్యూస్‌లైన్: సిమెంట్ ట్యాంకర్ మోపెడ్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పరిగి మం డల పరిధిలోని సుల్తాన్‌పూర్ గేట్ సమీపంలో హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇబ్రహీంపూర్‌కు చెందిన ఊరడి పాండు(35) పరిగి పట్టణంలోని తుంకలగడ్డలో సొంతంగా ఇల్లు నిర్మించుకొని అక్కడే భార్యాపిల్లలతో  ఉంటున్నాడు. ఆయన అక్కడే  ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో కాం ట్రాక్ట్ ప్రాతిపదికన వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆయన పని నిమిత్తం మోపెడ్‌పై మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో గ్రా మ సమీపంలో పరిగి వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ వెనుక నుంచి మోపెడ్‌ను ఢీకొంది. ప్రమాదంలో మెపెడ్ ధ్వంసమై పాండు ట్యాం కర్ వెనుక చక్రాల్లో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతుడికి భార్య జయమ్మ, కుమారుడు మధుసూదన్(8), కూతురు మానస(4) ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 అతివేగమే ప్రాణాలు తీసింది..
 
 పరిగి, న్యూస్‌లైన్: డ్రైవర్ నిర్లక్ష్యం.. అతి వేగం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మరో 17 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి ఉంది. మృతులంతా మహబూబ్‌నగర్ జిల్లావాసులు. ఈ ప్రమాదం పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్‌గేట్ సమీపంలో హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ తండాకు చెందిన గోపాల్(28) టాటా మ్యాజిక్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు.

 

ఈయన శనివా రం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నుంచి పరిగికి 21 మంది ప్రయాణికులతో బయలుదేరాడు. మం డల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్‌గేట్ సమీపంలో వాహనం వేగంగా ఉండడంతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పింది. దీంతో రోడ్డుపక్కనే ఉన్న మర్రిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికకక్కడే మృతిచెందగా 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలోంచి ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. కొందరు ఆటోలోనే చిక్కుకుపోయారు. కాగా ఆటో ముందు టైర్ పంక్చర్ అయి ఉండడంతో ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement