cement tanker
-
ఐదుగురిని బలిగొన్న ‘ట్యాంకర్’
ఓబులవారిపల్లె/రాయచోటి/అమరావతి: మద్యం మత్తు ఐదుగురు ప్రయాణికుల ప్రాణాలు తీసింది. అన్నమయ్య జిల్లా చిన్నఓరంపాడు వద్ద నాలుగో నంబర్ జాతీయ రహదారిపై దాబా హోటల్ సమీపంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సును సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కడప ఐసీఎల్ నుంచి చెన్నైకి సిమెంట్ పొడి లోడుతో వెళ్తున్న లారీ ట్యాంకర్ చిన్నఓరంపాడు దాబా వద్ద అదుపు తప్పి తిరుపతి నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని మితిమీరిన వేగంతో నడుపుతూ రోడ్డుకు అటూ ఇటూ తిప్పుతూ రావడాన్ని గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి బస్సును తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించి కుడి వైపునకు పూర్తిగా పక్కకు తిప్పాడు. దీంతో ట్యాంకర్ లారీ ఆర్టీసీ బస్సు మధ్య భాగంలో కండక్టర్ సీటు వద్ద నుంచి బస్సు వెనుక భాగం వరకు బలంగా ఢీకొంది. ఘటనా స్థలంలో ముగ్గురు.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరి మృతి బస్సులోని మ«ధ్య సీట్లలో కూర్చున్న వైఎస్సార్ జిల్లా కోగటం గ్రామానికి చెందిన బి.కమాల్ బాషా (65), అన్నమయ్య జిల్లా చిన్నఓరంపాడు జనంపల్లె దళితవాడకు చెందిన జి. శ్రీనివాసులు (60) అలియాస్ బుడ్డయ్య, రాజంపేట మండలం వెంకటరాజంపేట గ్రామానికి చెందిన కొమరావతి శేషాద్రి శేఖర్ (55)అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం దొగ్గలపాడు గ్రామానికి చెందిన చెవ్వు అమర్నాథ్రెడ్డి (25), నందలూరు మండలం ఆడపూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య (70)లను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఇంటర్మీడియెట్ చదువుతున్న నికిత, వెన్నెల అనే బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి తరలించారు. వీరు కాకుండా మరో 12 మందికి గాయాలయ్యా యి. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించారు. ప్రమాదం కారణంగా లారీ ట్యాంకర్, బస్సు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పుల్లంపేట నుంచి మంగంపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాజంపేట డీఎస్పీ చైతన్య ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున సహాయం అందించాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టినట్టు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్, వైఎస్సార్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు వేర్వేరుగా తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఘటనపై ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఆర్టీసీ తరఫున పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తామన్నారు. -
మాదాపూర్లో సిమెంట్ ట్యాంకర్ బోల్తా
మాదాపూర్ బయోడైవర్సిటీ జంక్షన్లో లిక్విడ్ సిమెంట్ కంటెయినర్ బోల్తాపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ద్రవ రూపంలో ఉన్న సిమెంట్ను ఫ్యాక్టరీ నుంచి తీసుకెళుతుండగా మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. కంటెయినర్ 40 టన్నుల బరువు ఉండడంతో మూడు క్రేన్లు తెప్పించి ప్రయత్నించినా దాన్ని తొలగించడం వీలు కాలేదు. తీవ్రంగా శ్రమించిన ట్రాపిక్ పోలీసులు మధ్యాహ్నానికి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించగలిగారు. -
స్కూటీని ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్
చేవెళ్లరూరల్: స్కూటీని ఎదురుగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మిర్జాపూర్ బస్స్టేజీ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ మండలం ఎన్నేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ మీర్ పాషా(36) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ పెళ్లిళ్లు, విందు కార్యక్రమాలకు వంటలు చేస్తుం టాడు. ఆదివారం ఆయన చేవెళ్లలో ఉంటున్న తన చెల్లెలు శెభానాబేగం వద్దకు వచ్చాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో మండలంలోని మిర్జాగూడ బస్స్టేజీ సమీపంలో వికారాబాద్ వైపు నుంచి ఎదురుగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మీర్ పాషా ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్కూటీని ఢీకొట్టిన అనంతరం సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి పక్కనే ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ట్యాంకర్ ముందుభాగం ధ్వంస మైంది. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు గమనించి 108 వాహనంలో మీర్పాషాను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆయన మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి వివరాలు తొలుత తెలియరాలేదు. ఆయన వద్ద ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబీకులకు ఫోన్ చేసిన పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మీర్పాషాకు వివాహమవగా గతంలోనే భార్య విడిపోయింది. మృతు డి తమ్ముడు ఖాజాపాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
వ్యక్తిని బలిగొన్న సిమెంట్ ట్యాంకర్
పరిగి, న్యూస్లైన్: సిమెంట్ ట్యాంకర్ మోపెడ్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన పరిగి మం డల పరిధిలోని సుల్తాన్పూర్ గేట్ సమీపంలో హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇబ్రహీంపూర్కు చెందిన ఊరడి పాండు(35) పరిగి పట్టణంలోని తుంకలగడ్డలో సొంతంగా ఇల్లు నిర్మించుకొని అక్కడే భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఆయన అక్కడే ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో కాం ట్రాక్ట్ ప్రాతిపదికన వర్కర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆయన పని నిమిత్తం మోపెడ్పై మండల పరిధిలోని సుల్తాన్పూర్కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో గ్రా మ సమీపంలో పరిగి వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ వెనుక నుంచి మోపెడ్ను ఢీకొంది. ప్రమాదంలో మెపెడ్ ధ్వంసమై పాండు ట్యాం కర్ వెనుక చక్రాల్లో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతుడికి భార్య జయమ్మ, కుమారుడు మధుసూదన్(8), కూతురు మానస(4) ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రాణాలు తీసింది.. పరిగి, న్యూస్లైన్: డ్రైవర్ నిర్లక్ష్యం.. అతి వేగం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మరో 17 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి ఉంది. మృతులంతా మహబూబ్నగర్ జిల్లావాసులు. ఈ ప్రమాదం పరిగి మండల పరిధిలోని రూప్ఖాన్పేట్గేట్ సమీపంలో హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ తండాకు చెందిన గోపాల్(28) టాటా మ్యాజిక్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన శనివా రం మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నుంచి పరిగికి 21 మంది ప్రయాణికులతో బయలుదేరాడు. మం డల పరిధిలోని రూప్ఖాన్పేట్గేట్ సమీపంలో వాహనం వేగంగా ఉండడంతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పింది. దీంతో రోడ్డుపక్కనే ఉన్న మర్రిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికకక్కడే మృతిచెందగా 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలోంచి ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. కొందరు ఆటోలోనే చిక్కుకుపోయారు. కాగా ఆటో ముందు టైర్ పంక్చర్ అయి ఉండడంతో ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.