మాదాపూర్ బయోడైవర్సిటీ జంక్షన్లో లిక్విడ్ సిమెంట్ కంటెయినర్ బోల్తాపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మాదాపూర్ బయోడైవర్సిటీ జంక్షన్లో లిక్విడ్ సిమెంట్ కంటెయినర్ బోల్తాపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ద్రవ రూపంలో ఉన్న సిమెంట్ను ఫ్యాక్టరీ నుంచి తీసుకెళుతుండగా మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. కంటెయినర్ 40 టన్నుల బరువు ఉండడంతో మూడు క్రేన్లు తెప్పించి ప్రయత్నించినా దాన్ని తొలగించడం వీలు కాలేదు. తీవ్రంగా శ్రమించిన ట్రాపిక్ పోలీసులు మధ్యాహ్నానికి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించగలిగారు.