పెళ్లయిన నెలకే.. | bride doubtfully died | Sakshi
Sakshi News home page

పెళ్లయిన నెలకే..

Aug 10 2016 6:07 PM | Updated on Sep 28 2018 3:41 PM

పెళ్లయిన నెలకే.. - Sakshi

పెళ్లయిన నెలకే..

పెళ్లయిన నెలకే వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంఘటన త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

రాజమహేంద్రవరం క్రైం: పెళ్లయిన నెలకే వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంఘటన త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆనంద్‌నగర్‌కు చెందిన నూకల లక్ష్మి(24), సిద్ధార్థనగర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ వీర్రాజు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జూలై 3న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. రూ.2 లక్షలు కట్నం, కొంత బంగారం పెళ్లి సమయంలో ఇచ్చారు. కాతేరు పంచాయతీలోని శాంతినగర్‌లో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. లారీపై బాకీ ఉందంటే, అదనంగా రూ.28 వేలు ఇచ్చా రు.

తనకు వేరే సంబంధాలు వస్తున్నాయని, రూ.7 లక్షలు ఇస్తామంటున్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని వీర్రాజు బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులను తట్టుకోలేక లక్ష్మి మంగళవారం ఇంట్లో శ్లాబ్‌ హుక్కుకు ఓణీతో ఉరివేసుకుని, ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసమే వీర్రాజు ఆమెను వేధించి, హతమార్చి ఉంటాడని మృతురాలి తల్లి మచ్చా మహాలక్ష్మి  ఆరోపించింది. వివాహం జరిగిన నెల రోజులు కూడా సంతోషంగా లేకుండా, తమ కుమార్తెను వేధించాడని విలపించింది. సంఘటన స్థలానికి సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ కులశేఖర్, త్రీటౌన్‌ సీఐ శ్రీరామకోటేశ్వరరావు, ఎస్సై సత్యనారాయణ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement