డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్వర్సిటీ పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంబీఏ విత్ ఐసెట్ , బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ అడ్మిషన్లకు ఈనెల 20 చివరి గడువు అని ఓపెన్ వర్సిటీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.
పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు 20 వరకు గడువు
Aug 13 2016 11:20 PM | Updated on Aug 17 2018 3:08 PM
విద్యారణ్యపురి : డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్వర్సిటీ పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంబీఏ విత్ ఐసెట్ , బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ అడ్మిషన్లకు ఈనెల 20 చివరి గడువు అని ఓపెన్ వర్సిటీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.
డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ బాటనీ, జూవాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్విరాన్మెంట్ సైన్స్, మ్యాథ్్సలలో వరంగల్ రీజినల్ సెంటర్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. దరఖాస్తుల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఏఓయూ ఆన్లైన్ ఇన్ వెబ్సైట్లో డౌన్లోడు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ విద్యార్హతల సర్టిఫికెట్లను స్టడీ సెంటర్లో చూపించాల్సి ఉంటుందన్నారు.
Advertisement
Advertisement