టీటీడీకి రూ.30లక్షల విరాళం | 30 lakhs donation to ttd | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ.30లక్షల విరాళం

Aug 19 2016 11:17 PM | Updated on Sep 4 2017 9:58 AM

విరాళాల డీడీలను భానుప్రకాష్‌ రెడ్డి ద్వారా తిరుపతి జేఈవోకు అందజేస్తున్న దాతలు

విరాళాల డీడీలను భానుప్రకాష్‌ రెడ్డి ద్వారా తిరుపతి జేఈవోకు అందజేస్తున్న దాతలు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని వివిధ ట్రస్టులకు దాతలు శుక్రవారం రూ.30లక్షల విరాళాన్ని అందజేశారు. కువైట్‌కు చెందిన భక్తుడు యూజీ సాయిబాబా రూ.20లక్షల విరాళం డీడీని టీటీడీ బోర్డు సభ్యుడు గుడిపల్లి భానుప్రకాష్‌ రెడ్డి ద్వారా టీటీడీకి అందజేశారు.

 
తిరుపతి అర్బన్‌: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని వివిధ ట్రస్టులకు దాతలు శుక్రవారం రూ.30లక్షల విరాళాన్ని అందజేశారు. కువైట్‌కు చెందిన భక్తుడు యూజీ సాయిబాబా రూ.20లక్షల విరాళం డీడీని టీటీడీ బోర్డు సభ్యుడు గుడిపల్లి భానుప్రకాష్‌ రెడ్డి ద్వారా టీటీడీకి అందజేశారు. అందులో రూ.10లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, రూ.10లక్షలు కాటేజీ డొనేషన్‌ పథకానికి అందిస్తున్నట్లు దాత సాయిబాబా తెలిపారు. ఆయనతో పాటు హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసులు కాటేజీ డొనేషన్‌ పథకానికి రూ.10లక్షలు విరాళం అందజేశారు. విరాళాల డీడీలను భానుప్రకాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్‌కు తిరుపతిలోని పరిపాలనా భవనంలో అందజేశారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement