విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి | 10 died in road accident in vishakapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

Jul 20 2015 11:46 AM | Updated on Aug 30 2018 3:56 PM

విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి - Sakshi

విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

విశాఖపట్నం లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

- ఐదుగురి పరిస్థితి విషమం
మధురవాడ(విశాఖపట్టణం): విశాఖపట్నం లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి ఆర్టీసీ బస్సు విశాఖ వైపు వెళ్తోంది. అదే సమయంలో మారికవలస వద్ద సర్వీసు రోడ్డులోంచి ఓ స్కార్పియో ఒక్కసారిగా హైవేపైకి వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నట్టుండి బస్సును కుడిచేతి వైపు తీసుకెళ్లాడు. దీంతో అటువైపున్న ఆటోను బస్సు ఢీకొట్టింది.

ఆ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పాన్ షాప్ పై నుంచి దూసుకెళ్లి పది మీటర్ల ముందుగా వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో, పాన్ షాప్ వద్ద ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో ఆరుగురు మృతిచెందగా,  క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement