బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 42 వేల క్యూసెక్కులతో ప్రారంభమైన వరద నీరు మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షా 42 వేల క్యూసెక్కులకు చేరుకుంది. తర్వాత క్రమంగా తగ్గుతూ 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఒక్క రోజు వ్యవధిలో 5.5 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల క్యాచ్మెంట్ ఏరియాలో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధతి పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1076.60 (43.51 టీంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. ఎస్సారెస్పీకి ఎగువనగల మహారాష్ట్రలోని విష్ణు పురి ప్రాజెక్ట్ నుంచి ఆదివారం రాత్రి 11.30 గంటలకు 0.5 టీఎంసీల వరద నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఎస్సారెస్పీకి చేరుకుంటుందన్నారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందన్నారు.
ఎస్సారెస్పీలోకి భారీగా వరద నీరు..
Published Mon, Aug 1 2016 7:20 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement