తేలు కుట్టి.. యువతి మృతి
తిరువళ్లూరు: తేలు కుట్టిన యువతికి చిక్సిత ఫలించకపోవడంతో మృతి చెందింది. తిరువళ్లూరు జిల్లా వెన్మనంబుదూర్ గ్రామానికి చెందిన సుధాకర్ కుమార్తె సాధన(19). గత నెల 10వ తేదీ తేలుకాటుకు గురయ్యింది. వెంటనే ఆమెను చిక్సిత కోసం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నై వైద్యశాలకు తరలించగా, అక్కడ చిక్సిత పొందుతూ మంగళవారం రాత్రి 12 గంటలకు మృతి చెందింది.