జయరాం హత్యకేసు; ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు | NRI Jayaram Murder Case Ibrahimpatnam ACP Malla Reddy Transferred | Sakshi
Sakshi News home page

జయరాం హత్యకేసు; ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు

Feb 5 2019 3:39 PM | Updated on Feb 5 2019 4:09 PM

NRI Jayaram Murder Case Ibrahimpatnam ACP Malla Reddy Transferred - Sakshi

మహేష్‌ భగవత్‌, జయరాం (ఫైల్‌)

రాకేష్‌రెడ్డితో ఏసీపీ మల్లారెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరాం హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డితో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఈ విషయం గురించి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మంగళవారం విలేరులతో మాట్లాడుతూ... నిందితుడు రాకేష్‌ రెడ్డి.. ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లుగా సమాచారం ఉందన్నారు. ఓ కేసు సందర్భంగా వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని.. ఆ క్రమంలోనే నిందితుడు.. మల్లారెడ్డితో సంబంధాలు పెంచుకున్నాడని తెలిపారు. (పిడిగుద్దులు గుద్దాను.. చనిపోయాడు!)

ఈ నేపథ్యంలో అంబర్‌పేట్‌ కార్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు మల్లారెడ్డిని అటాచ్‌ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ విషయమై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఇక ఇబ్రహీంపట్నం ఏసీపీగా వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. (ఎవరీ రాకేష్‌ రెడ్డి..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement