పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది, ఎస్‌ఐల బాహాబాహి

Inspector And Lawyer Fight in Pattabiram Police Station Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: చెన్నై సమీపంలోని పట్టాభి రాం పోలీసుస్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్, న్యాయవాది పరస్పరం దాడులు చేసుకున్నారు.  వివరాలిలా ఉన్నాయి. పట్టాభిరాం పోలీసుస్టేషన్‌లో జగదీశన్‌  సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం  ఓ కేసుకు సంబంధించి ఐనావరంకు చెందిన న్యాయవాది కార్తీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్, న్యాయవాదికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. అనంతరం ఇద్దరు వేర్వేరుగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జాయింట్‌ కమిషనర్‌ జగదీశన్‌ను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తొలగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top