పాస్టర్‌ వద్ద నుంచి యువతి అదృశ్యం | Sakshi
Sakshi News home page

పాస్టర్‌ వద్ద నుంచి యువతి అదృశ్యం

Published Mon, Feb 25 2019 12:16 PM

Girl Missing Case Medak - Sakshi

జహీరాబాద్‌ టౌన్‌: పాస్టర్‌ వద్ద ఉంటున్న యువతి అదృశ్యమైందని జహీరాబాద్‌ టౌన్‌ ఎస్‌ఐ. రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అత్నూర్‌ మండలం కన్యాల గ్రామానికి చెందిన కంది చెన్నయ్య చనిపోవడంతో ఆతని కుమార్తె స్వప్న(21) పెద్దనాన్న కంది గంగయ్య వద్ద ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం జహీరాబాద్‌కు చెందిన పాస్టర్‌ క్షీబారాణి కన్యాల గ్రామం వచ్చి దైవం సందేశ కార్యక్రమంలో పాల్గొంది. దైవ వచనాలను విన్న స్వప్న ఆకర్షితురాలై పాస్టర్‌ వెంట జహీరాబాద్‌కు వెళ్లింది.

పట్టణంలోని ఓ డెంటల్‌ క్లీనిక్‌లో పనిచేస్తూ పాస్టర్‌ వద్ద ఉండసాగింది. అక్టోబర్‌ 2018 సంవత్సరంలో ఓ సారి పాస్టర్‌ క్షీబారాణి స్వప్నను వెంటబెట్టుకుని కన్యాల గ్రామానికి వచ్చి వెళ్లింది. క్రిస్మస్‌ పండగకు స్వçప్నను పంపించాలని క్షీబారాణిని తండ్రి కంది గంగయ్య కోరగా ఆమె తన వద్ద లేదు, ఎక్కడికి వెళ్లిందో తెలియదన్న సమాధానం ఇచ్చింది. ఆమె ఆచూకీ దొరికితే చెబుతానంది. నెలలు గడుస్తున్న స్వప్న ఆచూకి లభించడంలేదని, తండ్రి గంగయ్య పాస్టర్‌ క్షీబారాణిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 

Advertisement
Advertisement