ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి | Five Die In Road Accident In Chittoor | Sakshi
Sakshi News home page

Aug 21 2018 3:17 PM | Updated on Aug 30 2018 4:17 PM

Five Die In Road Accident In Chittoor - Sakshi

ఓ లారీ వేగంగా వచ్చి వ్యాన్‌ను ఢీకొట్టింది. సంఘటన స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు వదిలారు.

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పోడూరు వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు వెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మృతులను తమిళనాడు వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని ధర్మపురికి చెందిన రామ్మూర్తి అనె వ్యక్తికి పక్షవాతం రావడంతో నాటు వైద్యం కోసం కుటుంబ సభ్యులతో విరుపాక్షపురంకు వచ్చి మందు తాగి ధర్మపురికి బయలుదేరారు.

ఈ క్రమంలో పోడూరు వద్దకు రాగానే.. కుప్పం వైపు నుంచి ఓ లారీ వేగంగా వచ్చి వ్యాన్‌ను ఢీకొట్టింది. సంఘటన స్థలంలోనే రామ్మూర్తి, మోహన్‌, శేఖర్‌ మృతి చెందారు. తీవ్రగాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement