కూకట్‌పల్లి ఐడీఎల్‌లో పేలిన రియాక్టర్‌

Fire Accident In IDL Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఐడీఎల్‌ సంస్థలో పేలుడు సంభవించింది. గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో రియాక్టర్‌ పేలడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన కార్మికుడు శర్మగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top