కూకట్పల్లి ఐడీఎల్లో పేలిన రియాక్టర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న ఐడీఎల్ సంస్థలో పేలుడు సంభవించింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన కార్మికుడు శర్మగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.