మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ.. | Explosive Materials Siezed In Charla | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ..

Aug 7 2018 9:48 AM | Updated on Oct 9 2018 2:49 PM

Explosive Materials Siezed In Charla - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తోన్న ఇద్దరు సానుభూతిపరులను ఖమ్మం జిల్లా చర్లలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చర్ల: మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తోన్న ఇద్దరు సానుభూతిపరులను ఖమ్మం జిల్లా చర్లలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. చర్ల -పూసుగుప్ప మార్గంలోని లెనిన్‌ కాలనీ శివారులో పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో అదే మార్గంలో ఈ ఇద్దరూ వస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు లభించాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మావోయిస్టులకు సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement