Husband and His Lover Got Arrested in Delhi Teacher Murder Case - Sakshi
Sakshi News home page

ప్రియురాలితో కలిసి భర్తే చంపించాడు

Nov 2 2018 11:42 AM | Updated on Nov 2 2018 1:04 PM

Delhi Teacher Murder Case Two Arrested - Sakshi

ఏంజెల్‌ గుప్తా (ఫైల్‌ ఫొటో)

ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన మంజీత్‌ ప్రియురాలితో కలిసి పథకం రచించాడు.

సాక్షి, న్యూఢిల్లీ : వాయువ్య ఢిల్లీలో కలకలం రేపిన స్కూలు టీచర్‌ హత్య కేసును ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన సునీత(38), మంజీత్‌(38) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. కాగా మంజీత్‌.. ఏంజెల్‌ గుప్తా అనే మోడల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా సునీత అడ్డు తొలగించుకోవాలని భావించిన మంజీత్‌ ప్రియురాలితో కలిసి పథకం రచించాడు. కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చాడు.

ఈ క్రమంలో స్కూలు టీచరుగా పనిచేస్తున్న సునీత.. సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తున్న సమయంలో దుండగులు ఆమెపై మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతిచెందారు. కాగా ఈ కేసులో మంజీత్‌, అతడి ప్రియురాలు ఏంజెల్‌ గుప్తాను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పరారీలో ఉన్న కిరాయి హంతకుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement