అంగట్లో సెల్‌ఫోన్‌ చోరీ  | Cell Phone Theft | Sakshi
Sakshi News home page

అంగట్లో సెల్‌ఫోన్‌ చోరీ 

Jun 11 2018 6:52 PM | Updated on Oct 17 2018 6:10 PM

Cell Phone Theft - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భిక్కనూరు: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన అంగడీలో సెల్‌ఫోన్‌ దుండగులు చేతి వాటాన్ని ప్రదర్శించారు. మండల కేంద్రానికి చెందిన చోటు అనే వ్యక్తికి చెందిన సామ్‌సంగ్‌ జే7 సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. చోటు అంగడీలో కూరగాయలు కొనేందుకు వెళ్లగా దుండగులు ఆయన  జేబులోని సెల్‌ఫోన్‌ను చోరీ చేశారు.

కొద్ది సేపు తర్వాత గ్రహించిన చోటు ఎంత వెతికినా దొరకలేదు. వెంటనే భిక్కనూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా పలువురి సెల్‌ఫోన్లు చోరీకి గురి కావడంతో పోలీస్‌లు అంగడీలో గస్తీని ఏర్పాటు చేశారు. పోలీసుల గస్తీ ఉన్నప్పుడు దుండగులు సెల్‌ఫోన్లను అపహరించడం లేదు. పోలీసులు గస్తీ లేని రోజున తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement